క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమునిపట్నం, డిసెంబర్ 26: భీమిలి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 22ఏళ్ల వివాహిత బుధవారం సాయింత్రం ఆత్మహత్యచేసుకున్న వైనమిది. భీమిలి క్రైం ఎస్‌ఐ పి.శ్రీను అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మిపురం గ్రామానికి చెందిన అంగటి రాము(22) అనే మహిళకు ఏడేళ్ల క్రితం దాలినాయుడుతో వివాహమైంది. వారికి ఒక పాప కూడా కలదు. ఐతే కొన్నాళ్లుగా ఆమె భర్తనుండి వేరుపడి ఉంటున్నది. ఐతే ప్రస్తుతం ఆమె మరిది శ్రీను ఇంట్లోనే ఉంటున్నది. ఆమె కుటుంబ సమస్యలతోను, అనారోగ్య సమస్యలతోను బుదవారం సాయింత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలనికి ఉన్న ఫేనుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
రోడ్డు ప్రమాధంలో గాయపడిన వ్యక్తి మృతి
మధురవాడ, డిసెంబర్ 26: మహావిశాఖ 5వ వార్డు పరిధిలోని స్వతంత్రనగర్ కాలనీలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాధంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పి.ఎం.పాలేం సిఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం వార్డు పరిధిలోని స్వతంత్రనగర్ కాలనీలో జి.రామచంద్రరావు (24) తన కుటుంబంతో నివాసముంటున్నాడు. ఇతను మంగళవారం రాత్రి తన ద్విచక్రవాహనంపై గణేష్‌నగర్ నుండి స్వతంత్రనగర్ కాలనీకి వెళుతుండగా తన బండి అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాధంలో రామచంద్రరావు తలకు తీవ్రగాయాలు కావడంతో అతన్ని నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరళించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య మీనాక్షితో పాటు రెండు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతుని తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ ఆధ్వర్యంలో ఎస్‌ఐ మల్లేశ్వరరావు దర్యాప్తుచేస్తున్నారు.