క్రైమ్/లీగల్

రోళ్లమడుగులో అటవీ సిబ్బందిపై ఎర్ర స్మగ్లర్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, డిసెంబర్ 27: కడపజిల్లా రాజంపేట మండలం రోళ్లమడుగు అటవ ప్రాంతంలో అందిన సమాచారంతో గురువారం అటవీ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్‌లో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురై అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడగా అటవీ శాఖకు చెందిన ప్రొటెక్షన్ వాచర్స్ ఇరువురు గాయపడ్డారు. వీరిలో ఒకరిని పట్టుకుని, అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 94 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ శ్రీనివాసులు తెలిపారు. రేంజర్ కథనం మేరకు అందిన సమాచారంతో అటవీ సిబ్బందితో కూంబింగ్ నిర్వహిస్తుండగా అడవి లోపలి భాగంలో అప్పటికే నరికిన ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటి ఆధారంగా ఇంకొంచెం లోపలి ప్రాంతంలోకి వెళ్లగా సుమారు 45 మంది స్మగ్లర్లు తారసపడగా వారిని చుట్టుముట్టగా వారు తమపై ఎదురుదాడి చేసి 44 మంది తప్పించుకోగా తమిళనాడుకు చెందిన కుప్పస్వామి దేవరాజ్‌ను అరెస్టు చేశామన్నారు. రవాణాకు సిద్ధంగా ఉన్న ఏ గ్రేడ్‌కు చెందిన 94 దుంగలను స్వాధీనం చేసుకుని రాజంపేట అటవీ కార్యాలయానికి తరలించామని రేంజర్ తెలిపారు. పట్టుబడిన 2905 కిలోల బరువు ఉన్న ఈ దుంగల విలువ మార్కెట్‌లో సుమారు కోటిన్నర ధర పలుకుతుంది. పరారైన స్మగ్లర్లను త్వరలో పట్టుకునేందుకు అడవిలో గాలింపుచర్యలు తీవ్రం చేశామని ఆయన చెప్పారు.