క్రైమ్/లీగల్

హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, డిసెంబర్ 27: ధర్మశాలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు విద్యార్థులు వెళుతున్న బస్సు బోల్తా పడిన ఘటనలో 35 మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం కాంగ్రా జిల్లాలో జరిగింది. విద్యార్థులు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌లో చదువుతున్నారు. ధర్మశాలలోని పోలీసు మైదానంలో మోదీ సభకు వెళ్లేందుకు ఈ విద్యార్థులు బస్సులో వెళుతుండగా, ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులు కోలుకోవాలని ఆయన ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. పిల్లల తల్లితండ్రులకు బాసటగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.