క్రైమ్/లీగల్

గుర్తు తెలియని వ్యక్తి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, డిశంబర్ 30: గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని కోకాపేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్‌చెరువు నుంచి గచ్చిబౌలి వైపు వస్తున్న రోడ్డులో గుర్తు తెలియని మృతదేహం పడి ఉండడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు.. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించగా 35 నుంచి 40 సంవత్సరాల వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముందే హత్య చేసి అనంతరం మృతదేహాన్ని రింగ్ రోడ్డుపై పడవేసినట్లు గుర్తించిన పోలీసులు టోల్ గేటులోని సీసీ పూటేజ్‌ని పరిశీలిస్తున్నారు. మృతుని చేతిపై ఎస్.లెనిన్ అని తమిళంలో రాసి ఉంది. మృతుడు తమిళనాడుకు చెందిన డ్రైవరై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పేకాట స్థావరంపై దాడి
మేడ్చల్, డిసెంబర్ 30: పేకాట స్థావరం పై పక్కా సమాచారంతో బాలానగర్ జోన్ ఎస్‌ఓటీ పోలీసు ఇన్‌స్పెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో దాడి చేసి 11 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం మేడ్చల్ మండలంలోని బాసురేగడి పరిధిలో శనివారం రాత్రి దాడి చేసిన ఎస్‌ఓటీ పోలీసులు పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 205320 నగదును, 11 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మేడ్చల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొల్లు నాయుడు తెలిపారు.