క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురబలకోట, జనవరి 14: సంక్రాంతి పండుగ రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కురబలకోట మండలంలోని అంగళ్ళు దగ్గరున్న మల్లేలగడ్డ వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముదివేడు ఎస్‌ఐ నెట్టి కంఠయ్య కథనం మేరకు మండలంలోని మట్టివారిపల్లె గ్రామం, శివరామపురంకు చెందిన వై.వీరనాగప్పనాయుడు (64) వ్యవసాయం చేసుకుంటూ చీటీలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇతను సోమవారం ఉదయం టివిఎస్‌పై ఇంటి నుండి మదనపల్లెకు బయలుదేరాడు. ముదివేడు మోడల్ స్కూల్ వద్ద బుడతనరాళ్ల దళితవాడకు చెందిన రామకృష్ణ (33) బస్సు కోసం వేచి ఉండగా, అతన్ని బండిపై ఎక్కించుకున్నాడు. ఇతను కూడా వ్యవసాయంతో పాటు మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో కలర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు అంగళ్ళు దాటుకుని మల్లేలగడ్డ సమీపంలో వెళుతుండగా ముందు వెళుతున్న బండిని ఓవర్ టేక్ చేసేందుకు యత్నించాడు. అప్పుడే ఎదురుగా మదనపల్లె వన్ డిపోకు చెందిన కదిరి ఆర్టీసీ బస్సు వచ్చింది. దీంతో మోపెడ్‌ను నిలుపరించలేకపోయారు. ప్రమాదవశాత్తు బస్సు కిందకు టివీఎస్ వాహనం దూసుకుపోయింది. తీవ్ర గాయాలకు గురై వై.వీరనాగప్పనాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చుని ఉన్న ఉంటా రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతన్ని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ సిఐ మురళీకృష్ణ హుటాహుటిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముదివేడు ఎస్‌ఐ నెట్టికంఠయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతి చెందిన వీరనాగప్పనాయుడు ఆ గ్రామ మాజీ సర్పంచ్ శివరామప్పనాయుడుకి సోదరుడు.