క్రైమ్/లీగల్

ఇద్దరి బలవన్మరణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగుటౌన్, జనవరి 16: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండం పాలంపేటలో ప్రేమ కోసం బోడ సింధూజ (18) అనే అమ్మాయి, పరువు కోసం అదే గ్రామానికి చెందిన అబ్బాయి తండ్రి రాజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పండుగ పూట ఈ సంఘటన చోటుచేసుకోవడంతో పాలంపేట గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే పాలంపేట గ్రామానికి చెందిన బోడ సింధూజ చనిపోవడంతో, అమ్మాయి తల్లి సుమలత వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో కడుపు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం అనంతరం సింధూజ మృతదేహానికి అంత్యక్రియలు సిద్ధం చేస్తున్న సమయంలో కొంబత్తు రమేష్ ప్రేమ పేరుతో మోసం చేయడం వలన సింధూజ ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ రమేష్ ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి సింధూజ బంధువులు అందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు రమేష్ ఇంటి ముందు నుంచి సింధూజ మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు చేయించారు. సింధూజ ఆత్మహత్యకు తన కుమారుడు రమేష్‌ను బాధ్యున్ని చేస్తూ ఇంటి ఎదుట ఆందోళనలు చేయడంతో మనస్తాపానికి గురై అబ్బాయి తండ్రి రాజు మంగళవారం సాయంత్రం పురుగుల మందుతాగగా ములుగు ఏరియా వైద్యశాలకు తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో మరణించారు. రాజు భార్య రమ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిత్రాలు.. పోస్టుమార్టం గదిలో రాజు మృతదేహం,
* మృతురాలు సింధూజ (ఫైల్ ఫొటో)