క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జనవరి 16: కనుమ రోజు పండుగ సరదా ఇంకా తీరకముందే ఆ కుటుంబంలోని ముగ్గురు తిరిగిరాని లోకాలకు చేరారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ బైపాస్‌వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో బాలుడికి చేయి విరిగింది. ఏకాకిలా బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలలోకి వెళితే హైదరాబాద్ హబ్సిగూడ ప్రాంతానికి చెందిన రావి వెంకట మురళీకృష్ణ (48), అక్కినేని కవిత (35), రావి ధనుష్ (16), యూనిక్ కృష్ణ (10) కుటుంబంతో కారులో అమ్మమ్మ ఊరైన కృష్ణా జిల్లా నూజివీడు మండలం పోతినేని పాలెం గ్రామానికి వెళ్ళి తిరిగి హైదరాబాద్ వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. కోదాడ సమీపంలోని కొమరబండ బైపాస్ వద్ద టైర్ బరెస్ట్ కావడంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి అటుగా వెళ్తున్న ఇన్నోవా మరియు హోండాసిటీ కార్లపై పడి అనంతరం బోల్తాకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు యూనిక్ కృష్ణ (10) చేయి విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారని, వేరే కారులలో ప్రయాణిస్తున్న 5 గురికి గాయాలయ్యాయని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చిత్రాలు.. మృతి చెందిన కవిత, ధనుష్
*కారు నుంచి మృతదేహాన్ని బయటకు తీస్తున్న పోలీసులు