క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో మెడికల్ విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, జనవరి 20: రోడ్డు ప్రమాదంలో మెడికల్ విద్యార్థిని మృతి చెందడంతో పాటు ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాల పాలయిన సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని ఏపీ లింగోటం శివారులో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి కామినేని వైద్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న స్రవంతి, నవజ్యోతి, రమ్యలు ఆదివారం సెలవు దినం కావడంతో స్కూటీపై ఏపీ లింగోటం గ్రామానికి వెళ్లి అల్పాహారం చేసి మళ్లీ తిరిగి కామినేనికి వచ్చేందుకు హైవే రోడ్డు మీదుగా వచ్చారు. ఈ క్రమంలో అతివేగంగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మెడకల్ విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయాలపాలయిన విద్యార్థిని స్రవంతి (25) చికిత్స పొందుతూ మరణించింది. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటనలో పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతి చెందిన విద్యార్థిని అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలయిన మరో ఇద్దరు విద్యార్థినులు హైదరాబాద్‌కు చెందిన వారుగా పోలీసులు తెలిపారు.