క్రైమ్/లీగల్

రూ. 1.60 లక్షల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 22: తిరుపతి రైల్వేస్టేషన్‌లోని 4వ నెంబర్ ప్లాట్‌ఫాం వద్ద తమిళనాడుకు చెందిన కె.సురేంద్రన్ (25)ను రైల్వే పోలీస్ స్టేషన్ సీఐ ఎ.ఆశీర్వాదం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 1.60 లక్షలు విలువ చేసే 2వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆయన కథనం మేరకు తమిళనాడు రాష్ట్రం, తెని జిల్లా ఉత్మపాల్యం తాలూకా కురుమంగమయన్‌కు చెందిన కె.సురేంద్ర, తునిలో గుర్తు తెలియని వ్యక్తినుంచి 2వేల కేజీల గంజాయిని కొనుగోలు చేశాడు. దానిని 16 కేజీల చొప్పున 8 బండిల్స్‌గా తయారు చేసి మధురైకి వెళ్లేందుకు రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో తమ రాకను గుర్తించిన సురేంద్ర అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా పట్టుకుని తనిఖీ చేశారు. అతని వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో గంజాయి ఉండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్ సమక్షంలో గంజాయిని సీజ్ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.