క్రైమ్/లీగల్

ప్రేమ పేరుతో వంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్పుపం, జనవరి 22: ప్రేమించిన వ్యక్తి మోసగించాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గుడుపల్లి మండలం, కంచుబందార్లపల్లిలో మంగళవారం జరిగింది. ప్రేమ పేరుతో వెంటపడి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకొని మూడేళ్లుగా తనను లైంగికంగా వాడుకొని ఇప్పుడు మరో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే మనస్థాపంతో గుడుపల్లి మండలం కంచిబందార్లపల్లి గ్రామానికి చెందిన కవిత ప్రియుడు ఇంటి ముందు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే కంచిబందార్లపల్లి గ్రామానికి చెందిన నాగప్ప కుమారుడు బాలు ఇదే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమార్తె కవితలు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈనేపథ్యంలో మూడేళ్ల క్రితం గుట్టుచప్పుడు కాకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే మూడేళ్లుగా తనతో శారీరకంగా కలసివున్న బాలు ఇప్పుడు మరో వివాహం చేసుకునేందుకు సిద్ధపడడంతో రెండు రోజుల క్రితం గుడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోకపోవడం, తమ పరువు పోయిందని పుట్టింటి వారు ఇంటిలోకి చేర్చకపోవడంతో ఏమి చేయాలో తెలియక తనకు న్యాయం చేయాలని మంగళవారం సాయంత్రం ప్రియుడు ఇంటి ముందు బైఠాయించింది. అయితే నువ్వు నాకు తెలియదు ఇక్కడ ఎందుకు వచ్చావని ప్రియుడు బాలు అడగడంతో చేసేదిలేక తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. దీనితో గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా పోలీసుల జోక్యంతో పురుగుల మందు తాగిన కవితను కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.