క్రైమ్/లీగల్

ఎన్‌ఐఏ కోర్టుకు కిడారి, సివేరి హత్య కేసు నిందితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 24: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము హత్య కేసులో నిందితుడైన ధర్మయ్యను ఎన్‌ఐఏ అధికారులు గురువారం విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కొద్దినెలల క్రితం మావోయిస్టులు కాల్పులు జరిపి కిడారి, సివేరిలను హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో పలువురు నిందితులను ఏపీ సిట్ పోలీసుల బృందం గతంలో అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండులో కొనసాగుతున్నారు. కాగా కేసు దర్యాప్తు ఎన్‌ఐఏ చేపట్టిన తర్వాత నిందితుల్లోని పలువురిని కోర్టు అనుమతితో తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిలో భాగంగా ధర్మయ్య కస్టడీ గడువు ముగియడంతో ఎన్‌ఐఏ అధికారులు విజయవాడ తీసుకువచ్చి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు) ఎదుట హాజరుపరిచారు.