క్రైమ్/లీగల్

రాజబొల్లారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జనవరి 26: ద్విచక్రవాహనాన్ని టిప్పర్‌లారీ ఢీకొన్న సంఘటనలో వ్యక్తితో పాటు బాలుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గ్రాయాలైన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎస్‌ఐ గజేందర్ తెలిపిన వివరాల ప్రకారం- నగరంలోని బేగంపేట్ రసూల్‌పురా ప్రాంతానికి చెందిన నర్సింగ్(27) తన పల్సర్ బైక్‌పై అదే ప్రాంతానికి చెందిన జిత్తు(10), భాను(11), సాయి(12)లతో కలిసి శనివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు కావడంతో శామీర్‌పేట్ చెరువు చూడటానికి వచ్చారు. కొన్ని గంటలు చెరువు వద్ద సరదగా గడిపి సాయంత్రం నగరానికి తిరిగి వెళ్తుండగా మండలంలోని రాజబొల్లారం గ్రామ పరిధిలోని (మేడ్చల్ - శామీర్‌పేట్ అనుసంధాన రోడ్డు) బాలు హోటల్ సమీపంలోని మలుపు వద్ద బైక్‌ను టిప్పర్‌లారీ అతిబలంగా ఢీకొట్టింది. దీంతో జిత్తు అనే బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మిగతా ముగ్గురు నర్సింగ్, భాను, సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 అత్యవసర వాహనంలో చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నర్సింగ్ మృతి చెందాడు. మిగతా ఇద్దరు బాలురను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. వీరి ముఖాలకు తీవ్రంగా గాయాలయ్యాయని వారు కోలుకుంటున్నారని వివరించారు. కొద్ది గంటలసేపు శామీర్‌పేట్ చెరువు వద్ద సరదగా గడిపిన వీరిని నిమిషాల వ్యవధిలోనే మృత్యురూపంలో వచ్చిన టిప్పర్‌ లారీ కబళించింది. దుర్ఘటన చూపరుల కలచివేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గజేందర్ తెలిపారు.