క్రైమ్/లీగల్

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన గోధుమకుంట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం గోధుమకుంట గ్రామానికి చెందిన రేగు జంగయ్య (35) సోమవారం ఉదయానే్న టిప్పర్ లారీలో మట్టిని తీసుకువచ్చి ప్లాటు స్థలంలో పోస్తున్నాడు. టిప్పర్ పైభాగాన ఉన్న విద్యుత్ తీగలు టిప్పర్‌ను తాకడంతో ఉన్నట్టుండి విద్యుత్ షాక్ తగిలింది. టిప్పర్‌ను ఆనుకొని ఉన్న జంగయ్యకు విద్యుత్ షాక్ తగలటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ తీగలు క్రిందకు వేలాడుతూ ఉన్నాయని, దీనికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జంగయ్య మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు వెంటనే ఆదుకోవాలని అన్నారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
కేశంపేట, జనవరి 28: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయపడిన సంఘటన మండల పరిధిలోని అల్వాలలో చోటుచేసుకుంది. కేశంపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మండల కేంద్రం నుంచి అల్వాల వెళ్లే రహదారిలో కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన కర్ణ (30) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడ్డాడు. వాహనంపై ఉన్న వ్యక్తి తలకు, కాలుకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వివరించారు.