క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఏపీఎన్జీవో నేత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 3: ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏవీవీఎస్‌వీవీ నరసింహం నగరంలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడి శనివారం రాత్రి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన వైద్యశాఖలో 1995లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. పదోన్నతి పొంది సూపరింటెండెంట్‌గా గొల్లపూడిలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నారు.
గత నెల 31న జరిగిన ఏపీ ఎన్జీవో సభలో రాష్ట్ర కార్యవర్గంతో పాటు పాల్గొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా విజయవాడలో జరిగిన కారు ప్రమాదంలో రాష్ట్ర కోశాధికారి వీరేంద్రబాబు, ఉపాధ్యక్షుడు డీవీ రమణ, కార్యదర్శులు నరసింహ, వసంతరావు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆంధ్ర ఆసుపత్రిలో చేర్పించగా మిగిలిన వారు కోలుకోగా నరసింహం మృతి చెందారు. నరసింహం పార్ధివదేహానికి ఆదివారం కృష్ణలంక శ్మశానవాటిలో అంత్యక్రియులు నిర్వహించారు. నరసింహంకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.