క్రైమ్/లీగల్
ద్విచక్రవాహనంపై జారిపడి గిరిజన మహిళ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 February 2019
పాచిపెంట, ఫిబ్రవరి 14: ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి మండలంలో నూరువరహాలపాడు గ్రామానికి చెందిన బడ్నాన రాములమ్మ(35) మృతిచెందినట్లు ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు. అందించిన వివరాల ప్రకారం రాములమ్మ బుధవారం నిత్యవసర సరుకుల నిమిత్తం గురివినాయుడుపేట వచ్చింది. స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా మార్గం మధ్యలో కటారికోటకు చెందిన పి పోలయ్య ద్విచక్రవాహనం ఎక్కింది. అయితే నందేడువలస వద్దకు వచ్చేసరికి జారిపడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే 108వాహనంలో సాలూరు సిహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. విజయనగరంలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందిందని ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు.