క్రైమ్/లీగల్

మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 14: డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సీమాదేవి, సోను భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం జార్ఖండ్ నుంచి నగరంలోని కాటేదాన్ పారిశ్రామికవాడకు వచ్చి ఓ కంపెనీలో పని చేస్తున్నారు. పల్లెచెరువు పాత ఉడంగడ్డ వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి కూతురు రియా(2) ఉంది. బుధవారం రాత్రి సీమాదేవి తన పనుల్లో ఉండగా రియా ఆడుకుంటుంది. ఆ సమయంలో ఇంటి వద్ద ఉన్న ఓ డ్రైనేజీ మూత తెరిచి ఉండటంతో అందులో పడింది. ఇంట్లో చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన సీమాదేవి, సోను.. స్థానికంగా పలు ప్రాంతాల్లో వెతికి చూశారు. ఎంతకీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో చూశారు. అందులో చిన్నారి రియా కనిపించింది. బయటకు తీసి చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారి రియా మృతికి అధికారులు, ఇంటి యజమాని కారణమని అని ఆందోళన చేశారు. మూడు నెలల క్రితం ఈ కాలువలో పడి ఓ చిన్నారి తీవ్ర గాయాలపాలయ్యారని తెలిపారు. ఇప్పుడు తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.