క్రైమ్/లీగల్

రౌడీషీటర్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, ఫిబ్రవరి 14: ఇద్దరు రౌడీ షీటర్లు ఫుల్‌గా మద్యం సేవించారు. చిన్నపాటి గొడవపడి పెద్దగా మారింది. ఒకరిఒకరు దాడి చేసుకున్నారు. ఓ రౌడీషీటర్, మరో రౌడీ షీటర్‌ను కత్తితో పొడిచి, చివరికి బండరాయితో తలపై మోది హత్య చేసిన సంఘటన మంగళహాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ జీ.రణావీర్ రెడ్డి కథనం ప్రకారం మంగళహాట్ శివలాల్‌నగర్ బలరాంగల్లీకి చెందిన నర్సింగ్ కుమారుడు సందీప్ సింగ్(24) గతంలో ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అదే ప్రాంతానికి చెందిన విశాల్ అనే యువకుడు కూడా రౌడీషీటర్. ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడిపిస్తుంటాడు. 2011లో పక్కనే ఉన్న బట్టల షాపును తగలబెట్టిన సంఘటనలో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. సందీప్ సింగ్, విశాల్ సింగ్ ఇద్దరు కొంత కాలంగా మిత్రులు. బుధవారం ఇద్దరు కలిసి విశాల్ సింగ్ ఇంటి సమీపంలో నిర్మాణ భవనం వద్ద మద్యం సేవించారు. గురువారం తెల్లవారుఝామున రెండు గంటల సమయంలో మద్యం సేవిస్తుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో విశాల్, సందీప్ సింగ్‌ను కత్తితో పొడిచి, చివరికి తలపై బండరాయితో మోది హత్య చేశాడు. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాల్ సింగ్‌ను త్వరలో పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.