క్రైమ్/లీగల్
కృష్ణా ట్రిబ్యునల్ విచారణ నేటికి వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 February 2019
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన కృష్ణా నది జలాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ట్రిబ్యునల్ ముందుకు గురువారం తెలంగాణ తరఫుసాక్షిగా ఉన్న పళనిస్వామిని ఆంధ్రప్రదేశ్ తరపు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దక్షిణ భారతదేశంలోని వాతవరణం, వర్షాలు, నీటి పారుదల తదితర అంశాలపై న్యాయవాది గంగూలీ పళని స్వామిని ప్రశ్నించగా వాటికి సమాధానాలు ఇచ్చారు. ట్రిబ్యునల్ ముందు శుక్రవారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది.