క్రైమ్/లీగల్
తొమ్మిది లక్షల విలువైన గంజాయి స్వాధీనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 February 2019
రావికమతం, ఫిబ్రవరి 18: ఐసర్ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు తొమ్మిది లక్షల విలువైన 285 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని దీనిని తరలిస్తున్న డ్రైవర్పై కేసు నమోదు చేసామని కొత్తకోట ఎస్సై బి.శేఖరం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో దొండపూడి చెక్పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానంతో ఈదారిలో వెళ్తున్న ఐసర్ వ్యాన్ను తనికీ చేయగా ఫ్లాస్టిక్ ఫ్యాకెట్లలో 285 కిలోల గంజాయిని గుర్తించామన్నారు. ఈమేరకు తెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా గచ్చర్ మండలం సురేంద్రనగర్కు చెందిన జె.జల్సాసింగ్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దారకొండ ఏజన్సీ నుంచి హైదరాబాద్కు ఈగంజాయిని తరలిస్తున్నట్లు నిందితుడు తెలిపినట్లు ఎస్సై శేఖరం తెలిపారు.