క్రైమ్/లీగల్
20 మందిపై కేసు నమోదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 March 2018
చక్రాయపేట, మార్చి 22: లైసెన్సులు లేని అక్రమ వాహనాల యజమానులు 20 మందిపై కేసు నమోదు చేసి రూ.7 వేలు జరిమానా వేసినట్లు ఎస్ఐ గోవిందరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని రాయచోటి-వేంపల్లె ప్రధాన రహదారిలో లైసెన్సు, ఆర్సీ, హెల్మెట్ లేని అక్రమ వాహనాలపై జరిమానా వేయడంతో పాటు అక్కడ మద్యం తాగి వాహనాలు నడుపుతున్న యజమానులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఏది ఏమైనప్పటికీ మద్యం తాగి వాహనాన్ని నడిపినా, లైసెన్సు, ఆర్సీ, హెల్మెట్ లేకపోయినా అలాంటి వాహనాలపై జరిమానాలు వేయడంతో పాటు కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని, అలా జరగకుండా ద్విచక్రవాహనాల యజమానులు జాగ్రత్తగా చూసుకోవాలని వారు గుర్తు చేశారు.