క్రైమ్/లీగల్

ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపచోడవరం, మార్చి 6: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఆటో లారీని ఎదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం ఉదయం ఎటపాక మం డలం గన్నవరం గ్రామానికి చెందిన సూరిపాక లావణ్య (23), చిన్నబోయి న ప్రవల్లిక (24), గంజి వీరబాబు, గుండెపోటు రమేష్ ఆటోలో రాజమహేంద్రవరం బయలుదేరారు. సీతపల్లి గ్రామ సమీపంలోని మలుపులో లారీని తప్పించబోయి ఎదురుగా వస్తున్న మరో లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లావణ్య, ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ మునిశెట్టి ప్రశాంత్ (25) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు రంపచోడవరం ఎస్సై విజయ్‌బాబు తెలిపారు.