క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, మార్చి 11: కానూరు పరిధిలోని కామయ్యతోపు సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లి సోమవారం మృతి చెందిన సంఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గత సోమవారం బైక్ ఢీకొనడంతో దైవర్సీ (35)కి రోడ్డు దెబ్బ తగిలి కోమాలోకి వెళ్లింది. వారం రోజులుగా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ పెద్దిరాజు తెలిపారు. దైవర్సీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొనే్లళ్లుగా భర్తకు దూరంగా పిల్లలతో జీవిస్తున్నారు. కుమారై సీయోను కుమారి 9వ తరగతి, కుమారుడు 7వ తరగతి చదువుతున్నారు. వారి రోదన చూపరులను కలిచివేసింది.