క్రైమ్/లీగల్

ప్రేమజంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, కొత్తూరు రూరల్, మార్చి 31: ఇటీవలే ఇద్దరూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. ఇద్దరూ చదువుకొని ప్రయోజకులవుతారని ఆశించిన తల్లిదండ్రులు ఆదివారం పిడుగులాంటి వార్త విని శోకసంద్రంలో మునిగారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగం మండలం పిట్టలగూడెం గ్రామానికి చెందిన గంటిశెట్టి ప్రవీణ్(23), మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన మయూరి (18) రెండు సంవత్సరాల నుంచి శంషాబాద్ చైతన్య కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ చదువుతున్నట్లు తెలిపారు. ఇక్కడే వారు ప్రేమించుకున్నట్లు తోటి స్నేహితులు చెపుతున్నారు.
శనివారం సాయంత్రం ఇంటి నుంచి ప్రవీణ్ ఇండిగో కారు తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. మార్గమధ్యలో ప్రేమికురాలు మయూరిని తీసుకుని మండల పరిధిలోని పిల్లోనిగూడ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుఝామున హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న ట్రైన్ సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సంగమేశ్వర్.. పరిసరాలను పరిశీలించారు. సంఘటన నుంచి దాదాపు 150 మీటర్ల దూరంలో కారు ఆపి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చ్ఘేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.