క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదినేపల్లి, ఏప్రిల్ 3: అతి వేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందిన ఘటన బుధవారం కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం వణుదుర్రు గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వణుదుర్రు గ్రామానికి చెందిన జంగం దుర్గారావు(25), యండ్రపాటి ఆదాము(60), యండ్రపాటి దేవమాత (55) ద్విచక్ర వాహనంపై కొత్తపల్లి నుండి తమ స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పగా పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొని పంట బోదెలోకి దూసుకుపోయారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురూ అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహాలను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి ఎస్‌ఐ జి రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ముదినేపల్లి ఎస్‌ఐ జి రామకృష్ణ ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.