క్రైమ్/లీగల్

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో రూ. 77 కోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న నగదు దాదాపు రూ. 77 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలీసులకు రూ 42 కోట్లు పట్టుబడగా, ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ.27 కోట్లు స్వాధీనం చేసుకున్నారని అధికారులు వివరించారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 20 లక్షల లీటర్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ. 28 లక్షల విలువైన వివిధ రకాల వస్తువులను అధికారులు సీజ్ చేశారు.