క్రైమ్/లీగల్

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు వౌనదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 12: నాడు ప్రేమించానని వెంటపడ్డాడు. చివరకు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. ఓ సంవత్సరం పాటు కాపురం కూడా చేశాడు. మోజు తీరాక గుట్టు చప్పుడు కాకుండా వదిలేశాడు. ఎలాగైనా తన ప్రియుడి కళ్లు తెరిపించి తన సొంతం చేసుకోవాలని సంకల్పంతో ప్రియుడి ఇంటి ముందు వౌన దీక్ష చేపట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోటపల్లి మండల కేంద్రానికి చెందిన అష్షు అలియాస్ ఫాతిమా, అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ 16 నెలల క్రితం ప్రేమించుకుని వారిరువురు పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు. 14 నెలలపాటు వికారాబాద్‌లో ఇల్లు తీసుకుని నివాసం ఉన్నారు. రెండు నెలల క్రితం శ్రీనివాస్‌గౌడ్ చెప్పాపెట్టకుండా సొంత ఊరికి వెళ్లి ఏమీ ఎరగనట్లు వ్యవహరిస్తున్నాడు. అష్షు ఫోన్ చేసినా స్పందించలేదు. ఇదేమిటని అడిగితే..నీ వు వేరే పెళ్లి చేసుకో అని ఉచిత సలహా ఇచ్చాడు. విషయం అష్షు తల్లిదండ్రులకు తెలియజేసి వికారాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో, భరోసా కేంద్రంలో ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో కావడంతో.. పోలీసుల నుంచి స్పందన రాకపోవడంతో శుక్రవారం శ్రీనివాస్ గౌడ్ ఇంటి ముందు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వౌనదీక్ష చేపట్టింది. ఈ విషయం ముందుగానే పసిగట్టిన శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వేరే ఊళ్లకు వెళ్లినట్లు బాధితురాలు పేర్కొంది. తనకు న్యాయం చేసేంతవరకు వౌన దీక్ష వీడనని భీష్మించుకు కూర్చుంది. స్థానిక పోలీసులు సైతం నచ్చచెప్పినా తనకు న్యాయం జరిగేంత వరకు వౌన దీక్ష వీడనంటుంది. ఉన్నతాధికారులు స్పందించి అష్షుకు న్యాయం చేయాలని బాధితురాలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
విద్యార్థిని ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12: ప్రేమ పేరుతో ఆకతాయి వేధింపులు తాళలేక విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ మోహన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పోల్కంపల్లి గ్రామానికి చెందిన చెరుకూరి మల్లేశ్, పుష్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె రుక్మిణి(17) ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పంది పవన్ ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటున్నాడు. కొంత కాలంగా రుక్మిణిని ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పలుమార్లు పవన్‌ను రుక్మిణి వెంట పడవద్దని మందలించారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాకపోగా వేధింపులు అధికమయ్యాయి. తనను ప్రేమించాలంటూ ఇటీవల తరుచూ రుక్మిణి వెంట పడుతున్నాడు. దీంతో ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు బాధపడతారని భావించిన రుక్మిణి ఎవరికి చెప్పుకోలేక తీవ్ర మనస్థాపంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన పంది పవన్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ వేధింపులతో రుక్మిణి ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ మోహన్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.