క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, ఏప్రిల్ 13: స్థానిక కొత్త పెదమద్దాలి వద్ద పామర్రు, గుడివాడ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆ ప్రాంతానికి చెందిన ఇటుకరాయి కార్మికులు నల్లూరి నాగేశ్వరరావు(61), భార్య పైడమ్మ(56) దంపతులు దుర్మరణం చెందారు. ఏపీ 16 డబ్ల్యు 6797 నెంబరు గల లారీ ఢీకొనగా వీరు మృతి చెందారు. నల్లూరి నాగేశ్వరరావు తన భార్య పైడమ్మతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు ఎక్కి ఇటుకరాయి బట్టీ వైపుకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. అదే సమయంలో ఈదురు గాలులు వీయటంతో ఇటుకరాయి బట్టీపై పరదాలు కప్పటానికి వీరు వెళుతున్నట్లు తెలిసింది. ఓట్ల పోలింగ్ రోజున మృతుడు నల్లూరి నాగేశ్వరరావు కుమార్తె పెదపూడి పద్మ ఓటు వేయటానికి కర్ణాటక నుంచి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఓటు వేసిన మరుసటి రోజే ఈ దుర్ఘటన జరగటం, కళ్లముందు తల్లిదండ్రులు చనిపోవటంతో పద్మ విలపిస్తున్న తీరు వర్ణనాతీతం. పామర్రు ఎస్‌ఐ హబీబ్ భాషా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం ఉదయం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుడివాడకు తరలించారు.