క్రైమ్/లీగల్

ప్రేమించలేదనే అక్కసుతో దాడి: ఆపై ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 14: తన ప్రేమను అంగీకరించడం లేదనే అక్కసుతో యువతి, ఆమె తల్లిపై దాడి చేసిన ఓ యువకుడు అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి తన స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే సంస్థలో పనిచేస్తున్న యువతి(26)ను కొంత కాలంగా తనను ప్రేమించాలని వెంటపడుతున్నాడు. తండ్రి మరణించి తీవ్రమైన కష్టాల్లో ఉన్న తనను వేదించవద్దని పలుమార్లు చెప్పినా వెంట పడేవాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ రెడ్డి శనివారం రాత్రి తాము ఉంటున్న సమీపంలోనే అద్దెకు ఉంటున్న వారి ఇంటికి వెళ్లాడు. యువతి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లిని తమ ప్రేమకు అడ్డుపడవద్దని హెచ్చరించాడు. తన కుమార్తెను ఒదిలిపెట్టాలని ప్రాదేయపడసాగింది. ఆమెపై స్క్రూడ్రైవర్‌తో దాడి చేశాడు. అదే సమయంలో ఇంటికి యువతి చేరుకుంది. తల్లిపై దాడి చేయవద్దంటూ అడ్డుపడింది. ఆగ్రహంతో ఊగిపోతూ ఇద్దరిపై దాడి చేశాడు. ఇరుగుపొరుగు రావడంతో శ్రీనివాస్ పారిపోయాడు. ఇరువురిపై దాడి చేసిన అనంతరం శ్రీనివాస్ సికింద్రాబాద్ స్టేషన్‌కు సమీపంలో రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ ఇద్దరు నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.