క్రైమ్/లీగల్

వేములవాడ రూరల్ ఎంపీటీసీ ఎన్నికకు హైకోర్టు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: సిరిసిల్ల-రాజన్న జిల్లా, వేములవాడ రూరల్ ఎంపీటీసీ స్థానానికి రిజర్వేషన్ ప్రక్రియ పున:పరిశీలన తర్వాత ఎన్నికల నిర్వహించాలని, అప్పటివరకు ఎన్నికను నిలిపివేయాలని హైకోర్టు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టలేదని, ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగనున్న ఎంపీటీసీ ఎన్నికను రద్దు చేయాలని ఎంపీపీ రంగు వెంకటేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ వాదనను సమర్థిస్తూ ఎంపీటీసీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. పిటిషనర్ తరఫున తీగుల రాంప్రసాద్ వాదించారు.