క్రైమ్/లీగల్
వారణాసి ఎన్నికల అధికారిపై రైతుల ఫిర్యాదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 4 May 2019
న్యూఢిల్లీ, మే 3: వారణసిలో తమ నామినేషన్ల తిరస్కరిచడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ, తమిళనాడు రైతులు ఫిర్యాదు చేశారు. వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాము ప్రయాత్నించామన్నారు. స్థానిక ఎన్నికల అధికారి తమ నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. ఈమేరకు సీఈసీకి వారణాసి ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై ఫిర్యాదు చేసినట్టు రైతులు వెల్లడించారు. పసుపు రైతుల నాయకుడు నరసింహనాయుడు మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే అధికారులు 24 మంది రైతుల నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. ఆఖరికి నామినేషన్ల పత్రాలు ఇవ్వడంలో సైతం తీవ్రమైన జాప్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.