క్రైమ్/లీగల్

పోలీసులకు లొంగిపోయిన జైషే మిలిటెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 5: పుల్వామా జిల్లాకు చెందిన ఓ మిలిటెంట్ ఆదివారం ఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయాడు. జైషే మహమ్మద్ మిలిటెంట్ సంస్థకు చెందిన ఈ ఉగ్రవాది పేరును వెల్లడించడానికి పోలీసులు అంగీకరించలేదు. ‘ఓ ఉగ్రవాది ఆయుధాలతో సహా లొంగిపోయాడని, జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చాడ’ని పోలీసులు వెల్లడించారు. ఒకపక్క అతని కుటుంబసభ్యులు, మరోపక్క పోలీసుల కృషివల్లే అతను జనజీవనంలో కలవాలని నిర్ణయించుకున్నాడని తెలిపారు. 2017 నుంచి ఇప్పటివరకు ఎందరో ఉగ్రవాదులు పోలీసులకు లొంగిపోయారని అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. హింసను విడనాడి సాధారణ జీవితం గడపాలని వారి కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తులను గౌరవించడం వల్లే లొంగిపోయే ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు.