క్రైమ్/లీగల్

భార్య, కొడుకుల చేతిలో ఒకరి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, మే 8: భార్య, కొడుకులు కలిసి ఒక వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున కొండంపల్లి రాజ్‌కుమార్‌రెడ్డి (45) అనే వ్యక్తిని ఆయన కుమారులు సంజయ్‌కుమార్‌రెడ్డి, సాయికుమార్‌రెడ్డి, భార్య అనిత ముగ్గురూ కలిసి దారుణంగా హత్య చేశారు. ఎస్సై కృష్ణ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజ్‌కుమార్‌రెడ్డి ప్రతినిత్యం తాగివచ్చి భార్య అనితతో గొడవపడేవాడు దీంతో విసిగిపోయన కుటుంబసభ్యులు ఆయనను అడ్డుతొల గించు కోవాలని నిర్ణయంచుకున్నారు. భార్య అనిత, కుమారులు కలిసి రాజ్‌కుమార్‌రెడ్డిని హత్యచేశారు. సంఘటనా స్థలాన్ని సీఐ శివకుమార్ సందర్శించారు. మృతుడి తమ్ముడు కోటేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై కృష్ణ తెలిపారు.
చిత్రం...హత్యకు గురైన రాజ్‌కుమార్ రెడ్డి