క్రైమ్/లీగల్

విశాఖలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 12: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలానికి చెందిన ప్రేమికులు సత్యనారాయణ, రౌత కమల ఆదివారం ఉదయం కైలాసగిరి కొండపై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, కమల అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించారు. కమలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సత్యనారాయణ, విశాఖ శివారు ప్రాంతంలో ఉంటున్న కమల ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే వీరిద్దరూ శనివారం రాత్రి విశాఖలో పర్యాటక ప్రాంతమైన కైలాసగిరికి చేరుకున్నారు. తమతోపాటు తెచ్చుకున్న పురుగుల మందును సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం స్థానిక సెక్యూరిటీ సిబ్బంది విగత జీవులుగా పడి ఉన్న వీరిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ప్రియుడు సత్యనారాయణ మృతి చెందినట్టు గుర్తించారు. ప్రియురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.ప్రియురాలు కమల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కమల హేండ్ బ్యాగ్‌లో ఉన్న సూసైడ్ నోట్‌ను ఆరిలోవ పోలీసులు స్వాధీనం చేసుకుని కుటుంబీకులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

చిత్రం... ఆత్మహత్యా యత్నం చేసిన ప్రేమికుల జంట