క్రైమ్/లీగల్
అమీన్పూర్లో దొంగల బీభత్సం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమీన్పూర్, జూన్ 15: పటన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మండల పరిధిలో గుర్తు తెలియని దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్పేట్కి చెందిన అరుందతి (58) భర్త నాగేందర్గౌడ్తో కలిసి అమీన్పూర్ పరిదిలోని వాణినగర్లో నివాసం ఉంటున్నారు. భర్త జహీరాబాద్ వద్ద ఉన్న కోహీర్లో బీఏఎమ్ఎస్ వైద్యుడుగా పనిచేస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే భర్త శుక్రవారం ఇంటినుండి కోహీర్కు పని నిమిత్తం వెళ్ల్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూసే సరికి అతని భార్య అరుందతి గాయాలతో రక్తపు మడుగులో పడి మృతిచెంది ఉంది. ఈ విషయాన్ని ఇరుగు పొరుగు వారికి తెలియ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా గుర్తు తెలియని దుండగులు నగదు, బంగారం కొరకు వచ్చి దొంగతనానికి పాల్పడి ఉంటారని ఈ క్రమంలో అడ్డుకున్న మహిళను కర్కశంగా గాయపరిచి, కంట్లో కారం చల్లి, ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి సుమారు లక్ష రూపాయల నగదు, 30 తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
చిత్రాలు.. అమీన్పూర్ పీఎస్ పరిధిలో దొంగల చేతిలో
హత్యకు గురైన మహిళ అరుంధతి *చిందర వందరగా పడి ఉన్న వస్తువులు