క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో విదేశీయుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 April 2018
పెదకాకాని, ఏప్రిల్ 1: గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలోని ఆటోనగర్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విదేశీయుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఇరాక్ దేశానికి చెందిన అబ్దుల్లా (42) ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసేందుకు ఇక్కడకు వచ్చాడు. ఆదివారం తన స్నేహితులను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై గుంటూరు వెళుతుండగా వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు అతన్ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో అతను తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.