క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ మంత్రి కుమారుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బరేలీ/డెహ్రాడూన్, జూన్ 26: ఉత్తరాఖండ్ విద్యాశాఖ మంత్రి అరవింద్ పాండే కుమారుడు అంకుర్ బరేలీ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలోని ఫరీద్పూర్ ప్రాంతంలో అంకుర్ ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొంది. గోరఖ్పూర్లో ఓ పెళ్లికి ఇద్దరు స్నేహితులతో కలిసి వెళుతుండగా, జరిగిన ఈ ప్రమాదంలో 22ఏళ్ల అంకుర్తో పాటు అతని స్నేహితుడు మున్నీగిరి (26) కూడా మృతి చెందాడు. గాయాలతో బయటపడిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వేరువేరు ప్రకటనలో ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.