క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, ఏప్రిల్ 2: మండలంలోని కానూరు గ్రామంలో రామా ప్లాస్టిక్స్ కంపెనీ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం అరసవల్లి శివశంకర్(36) కానూరు నవత ట్రాన్స్‌పోర్టు రోడ్డులో నివాసముంటున్నాడు. శివశంకర్‌కి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతని అనారోగ్యం వల్ల భార్య విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆదివారం సాయంత్రం బయటకు వెళ్లిన శివశంకర్ రామా ప్లాస్టిక్స్ కంపెనీ దగ్గరకు వచ్చేటప్పటికీ కరెంట్ పోవటంతో చీకట్లో మురుగు కాల్వలో పడి మృతి చెందాడు. అతని తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ కృష్ణకుమారి వివరించారు.