క్రైమ్/లీగల్

ఫేస్‌బుక్‌లో గుడ్‌బై చెప్పి... ఇంట్లోంచి అదృశ్యమైన పదో తరగతి విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, ఏప్రిల్ 2: పదో తరగతి పరీక్షలు రాసిన ఓ విద్యార్థి గత నెల 31న సాయంత్రం ఇంట్లోంచి బయటకు వచ్చి ఫేస్ బుక్‌లో ‘గుడ్ బై’ అంటూ పోస్ట్ చేసి అదృశ్యమైన ఘటన కేసముద్రం మండలం కలువలలో చోటుచేసుకుంది. కొడుకు కోసం రెండు రోజులుగా గాలించినా ఫలితం లేకపోవడంతో సోమవారం తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఘటనకు సంబం ధించిన వివరాలిలా ఉన్నాయి. కలువల గ్రామానికి చెందిన అనె్నబోయిన వెంకటసాయి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అనంతరం గత నెల 31న సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి ఇంటికి రాకపోగా ఫేస్‌బుక్‌లో ‘గుడ్‌బై’ అంటూ మెసేజ్ పోస్టు చేశాడు. దీనితో తండ్రి శ్రీను తమ వెంకటసాయి కోసం బంధువులు, మిత్రుల సహకారంతో రెండు రోజులుగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీనితో తన కొడుకు అదృశ్యమయ్యాడంటూ సోమవారం కేసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బాలుడి సమాచారం తెలిసినవారు 9440904646 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.