క్రైమ్/లీగల్

వేధింపులు భరించలేక భర్త హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, జూలై 8: భర్త వేధింపులు తాళలేక అతడిని భార్య రోకలి కర్రతో మోది హతమార్చిన సంఘటన ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్‌వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గంగారాం(54) అనే వ్యక్తి గత దశాబ్దకాలంగా ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో గంగారాం ఫినిష్‌పై స్వగ్రామానికి చేరుకున్నాడు. గ్రామంలో తనకున్న వ్యవసాయ పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం వెళ్లదీస్తున్నాడు. అయితే గంగారాం తరచూ భార్యను వేధింపులకు గురి చేయడం, చీటికి మాటికి కొట్టడం, మద్యం సేవించి వచ్చి దుర్భాషలాడుతూ వేధింపులకు పాల్పడేవాడు. ఆదివారం రాత్రి సైతం వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఆవేశంతో ఇంట్లో ఉన్న రోకలి కర్రతీసుకున్న భార్య సాయవ్వ భర్త తలపై మోదడంతో తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సోమవారం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవ పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి సోదరి గంగవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నట్టు ఇందల్‌వాయి పోలీసులు తెలిపారు. కాగా, మృతుడికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా, వారికి వివాహాలు కావడంతో వేరుగా ఉంటున్నారని స్థానికులు తెలిపారు.