క్రైమ్/లీగల్

నటి రీతూ పర్ణాకు ఈడీ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత్తా, జూలై 10: రోజ్ వ్యాలీ పోన్జి కుంభకోణంలో బెంగాలీ సినీ నటి రీతుపర్ణా సేన్‌గుప్తాకు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. కోట్లాది రూపాయల రోజ్ వ్యాలీ కుంభకోణానికి సంబంధించి నటుడు ప్రొసెన్‌జిత్ ఛటర్జీని ఈ నెల 19న తమ ముందు హాజరుకావాల్సిందిగా సమన్లు పంపించినట్లు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధికి తెలిపారు. కాగా రీతు పర్నాను వచ్చే వారం హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసినట్లు ఆ అధికారి చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం కింద విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఇలాఉండగా రెండు రోజుల క్రితం ఈ కుంభకోణానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు మదన్ మిత్రాను కూడా ఈడీ విచారణ జరిపింది.