క్రైమ్/లీగల్

కొడుకు తప్పిదానికి తండ్రికి శిక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి.నరసాపురం, ఏప్రిల్ 5: వివాహితను లైంగికంగా వేధించిన కుమారుడిని పెద్దల పంచాయతీకి తీసుకువస్తానని పోలీసులకు ఫిర్యాదుచేయకుండా అపిన తండ్రి తదనంతరం నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు అతడిని చెట్టుకు కట్టేశారు. దీనితో మనస్తాపానికి గురైన ఆ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం సాయింపాలెం గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి.. మండలంలోని మల్లుకుంట పంచాయతీ సాయింపాలెం గ్రామానికి చెందిన ఆడమిల్లి నాగేంద్ర అదే గ్రామానికి చెందిన చింతపల్లిశ్రావణి అనే వివాహిత యువతిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈనేపథ్యంలో ఈ నెల 3వ తేదీ ఉదయం 10గంటల సమయంలో నాగేంద్ర ఆమెను లైగింకంగా వేధించి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న శ్రావణి భర్త నాగేంద్రప్రసాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేయడానికి వెళ్తుండగా, నిందితుడి తండ్రి సంజీవరావు పెద్దల సమక్షంలో పంచాయతీ పెడదామని, తన కుమారుడిని తీసుకువస్తానని పెద్దమనుషుల ముందు తెలిపాడు. దీనితో నాగేంద్రప్రసాద్ ఫిర్యాదు విరమించుకున్నాడు. సంఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా సంజీవరావు తన కుమారుడిని పంచాయతీ వద్దకు తీసుకురాకపోవడంతో గ్రామ పెద్దలు సంజీవరావును ప్రశ్నించారు. తన కుమారుడు ఎక్కడున్నాడో తనకు తెలియదని ఈసందర్భంగా సంజీవరావు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో కోపోద్రిక్తులైన గ్రామ పెద్దలు సంజీవరావును గురువారం చెట్టుకు కట్టేశారు. పది నిముషాల అనంతరం అతడిని విడుదలచేశారు. దీనితోమనస్తాపానికి గురైన సంజీవరావు పురుగుల మందు తాగి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితురాలు శ్రావణి గురువారం టి.నరసాపురం పోలీసు స్టేషన్‌లో తనపై జరిగిన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాంబాబు తెలిపారు.

చిత్రం..తండ్రిని చెట్టుకు కట్టివేసిన దృశ్యం