క్రైమ్/లీగల్

బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, జూలై 20: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందిన సంఘటన కేశంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కేశంపేట మండలం ఎఖ్లాస్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన మాదపురం మల్లేష్ (28) సుందరాపురం గ్రామ సమీపంలోని సీడ్స్ పరిశ్రమలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి సుమారు 11గంట ల 30నిమిషాల సమయంలో ఎఖ్లాస్‌ఖాన్‌పేట నుంచి సీడ్ కంపెనీకి వెళ్తున్న సమయంలో అల్వాల్ గ్రామ సమీపంలోని కల్వర్టు దగ్గర బైకు అదుపుతప్పి పడిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ షాక్‌తో గేదెలు మృతి
కేశంపేట, జూలై 20: విద్యుత్ షాక్ తగిలి రెండు గేదెలు మృతి చెందాయి. శనివారం కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రైతు నగరం పెంటయ్యకు రెండు గేదెలు విద్యుత్ షాక్‌కు గురై చనిపోయాయి. వ్యవసాయం పొలం వద్ద గేదెలను మేపేందుకు తీసుకువెళ్లగా పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగిలి మృతి చెందాయని రైతు వివరించాడు. రెండు గేదెల విలువ రూ.1లక్ష50వేలు ఉంటుందని రైతు పెంటయ్య పేర్కొన్నాడు.