క్రైమ్/లీగల్

అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూలై 21: చెరకు సాగులో సంభవించిన నష్టం కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొవ్వ మండలం పెడసనగల్లులో చోటు చేసుకుంది. కూచిపూడి ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి ఆదివారం అందించిన వివరాల ప్రకారం పెడసనగల్లుకు చెందిన కొనకళ్ల విజయ కుమార్ (52) గత ఏడాది పెనమకూరులో ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని చెరకు సాగు చేశాడు. చీడపీడల కారణంగా దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు. అప్పుల వారి బాధలు తాళలేక శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న విజయకుమార్‌ను మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే శనివారం రాత్రి విజయకుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.