క్రైమ్/లీగల్

చిన్నారిని చిదిమేసిన పాఠశాల బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, జూలై 23: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారి బస్సు కింద పడి మృతి చెందింది. నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండ మండల పరిధిలోని ఉర్కొండపేట గ్రామంలో మంగళవారం బస్సు కింద పడి మనోజ్ఞ (5) అనే చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. ఉర్కొండ ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని ఉర్కొండ గ్రామంలో గల ప్రైవేటు పాఠశాలకు చెందిన పాఠశాల బస్సు ఉర్కొండపేట గ్రామంలోని పాఠశాల విద్యార్థులను బస్సులో ఎక్కించుకుని ముందుకు వెళ్తుండగా, బస్సు ముందు ఉన్న మనోజ్ఞను చూడకపోవడంతో బస్సు ముందు టైర్ కింద పడి అక్కిడిక్కడే మృతి చెందింది. ఉర్కొండపేట గ్రామానికి చెందిన శే్వతాఅనిల్ దంపతుల కుమార్తె మనోజ్ఞ అని ఎస్సై తెలిపారు. ఈ సంఘటనపై గ్రామస్థులు, కుటుంబసభ్యులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పాఠశాల బస్సును స్వాధీనం చేసుకున్నామని, బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు.
చిత్రాలు.. ప్రమాదానికి కారణమైన పాఠశాల బస్సు, (ఇన్‌సెట్‌లో) మృతి చెందిన చిన్నారి మనోజ్ఞ