క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 July 2019
గన్నవరం, జూలై 24: ఉంగుటూరు - ఆత్కూరు జాతీయ రహదారిపై స్వచ్చ్భరత్ ట్రస్టు సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు మోటారు సైకిల్ను ఢీకొన్న సంఘటనలో మోటారు సైకిల్పై ఉన్న ఇద్దరు మృతి చెందారు. ఆత్కూరు పోలీసుల కధనం ప్రకారం పొట్టిపాడుకు చెందిన మిర్యాల వీరాస్వామి (48), కారుకొండ సురేష్ (32) మోటారు సైకిల్పై వస్తుండగా పొట్టిపాడు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వీరిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆత్కూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.