క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 July 2019
పరిగి, జూలై 24: అనంతపురం జిల్లా పరిగిలో బుధవారం ఆర్టీసీ బస్సు కిందపడి తల్లీకొడుకు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. పరిగి మండలం విట్టాపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు తన భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు నవతేజ్తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో రోడ్డుపై పడిన భాగ్యలక్ష్మి (25), నవతేజ్పై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆంజనేయులుకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.