క్రైమ్/లీగల్

లాకర్లు పగులగొట్టి చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, : కూకట్‌పల్లి వివేకానందనగర్‌లోని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత గొట్టిముల పద్మారావు ఇంట్లో దొంగలు చొరబడి లాకర్లు పగలుగొట్టి సుమారు రూ.3కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారు. సంఘటన కూకట్‌పల్లిలో కలకలం సృష్టించింది. పోలీసుల కథదం ప్రకారం వివేకానందనగర్‌లో కాంగ్రెస్ నేత గొట్టిముక్కల పద్మారావు దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం సంగారెడ్డిలోని ఓ కార్యక్రమానికి వెళ్లారు. పద్మారావు కూతురు సుచరిత ఒక్కతే ఇంట్లో ఉంది. ఆమె గాఢనిద్రలో ఉండగా తెల్లవారుఝామున 3:30 ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి పైభాగం నుంచి కిటికి అద్దాలు పగులగొట్టి గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న లాకర్‌ను పగులగొట్టి సుమారు రెండున్నర కిలోల బంగారంతో పాటు కొన్ని విలువైన డైమాండ్ నెక్లెస్‌లను అపహరించారు. పద్మారావు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన ప్రాంతానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, వేలిముద్ర, నిపుణులను రప్పించి తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.