క్రైమ్/లీగల్

చెరువులో పడి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూలై 27: అనుమానాస్పద స్థితిలో చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ సర్కిల్ శాస్ర్తీపురంకు చెందిన యూసుఫ్ కుమారుడు తౌఫిక్(9), నజీరుద్ధీన్ కుమారుడు రోషుద్ధీన్(13) ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండే స్నేహితులు. కాగా ఈ నెల 25వ తేదీన ఈ ఇద్దరు బాలురు ఆడుకుంటూ వెళ్లిపోయారు. ఈ విషయంపై ఇరువురి తల్లిదండ్రులు శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరుణంలో శనివారం స్థానికంగా గల హుస్సేనీ చెరువులో ఇరువురి బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులకు స్థానికులు ఈ విషయాన్ని తెలపడంతో ఇరువురి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇరువురు బాలుర మృతికి గల కారణాలను దర్యాప్తులో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.