క్రైమ్/లీగల్
విద్యుత్ షాక్తో మహిళ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 July 2019
కొత్తూరు రూరల్, జూలై 28: విద్యుత్ షాక్కు గురై ఒక మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడినట్లు కొత్తూరు ఎస్ఐ కృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం మండల కేంద్రంలోని భవనం ఫస్ట్ప్లోర్లో మురుగునీరు నిలిచిపోవడంతో ఇనుప కడ్డీతో మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగడంతో జయమ్మ (56) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా కోడలు శైలజ (30) తీవ్రంగా గాయపడినట్లు ఎస్ఐ తెలిపారు. తీవ్రంగా గాయపడిన కోడలును శంషాబాద్లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మృతురాలి భర్త నర్సింహ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణ వివరించారు.