క్రైమ్/లీగల్

అల్లుడిని కొట్టి చంపిన మామ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, జూలై 28: అల్లుడిపై కర్రతో దాడి చేసి అతని మరణానికి కారణమైన మామ కూతాడి వెంకటేశ్వర్లుతో పాటు అతనికి సహకరించిన మృతుని భార్య సాలా నాగలక్ష్మి అలియాస్ మల్లీశ్వరిలను చల్లపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో అవనిగడ్డ డీఎస్పీ రమేష్‌రెడ్డి కేసు పూర్వాపరాలను మీడియాకు తెలిపారు. అవనిగడ్డకు చెందిన సాలా మురళీకృష్ణకు పదేళ్ళ క్రితం మంగళాపురం ఎస్టీ కాలనీకి చెందిన మల్లీశ్వరితో వివాహం జరిగింది. భార్య, భర్త మధ్య విబేధాలు తలెత్తడంతో గత రెండేళ్ళుగా నాగలక్ష్మి పుట్టిల్లైన మంగళాపురంలో భార్య, భర్తలు ఉంటున్నారు. ఈ నెల 24వ తేదీన అవనిగడ్డలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై వచ్చిన భార్య, భర్తలు రాత్రి 10గంటల సమయంలో గొడవ పడుతుండగా జోక్యం చేసుకున్న మామ కూతాడి వెంకటేశ్వర్లు కుమార్తెకు మద్దతుగా అల్లుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి ఉన్న కర్రతో తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్త్రావమైన మురళీకృష్ణను మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్య సహాయం కోసం ఈనెల 25వ తేదీన విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి సోదరి కందుల మంగమ్మ ఫిర్యాదు మేరకు చల్లపల్లి ఎస్‌ఐ పి నాగరాజు కేసునమోదు చేయగా సీఐ ఎన్ వెంకట రమణ దర్యాప్తు చేశారు. అల్లుడిని కర్రతో కొట్టి అతని మృతికి కారణమైన కూతాడి వెంకటేశ్వర్లు, భర్తతో గొడవ పడుతూ తండ్రిని ప్రోత్సహించిన మల్లీశ్వరి అలియాస్ నాగలక్ష్మిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రమేష్‌రెడ్డి తెలిపారు.